Prashanth Neel: కన్నడలో ఉగ్రం..కేజీఎఫ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. సరిగ్గా రాజమౌళి బాహుబలి తీసి మన సౌత్ సినిమా రేంజ్ని పాన్ ఇండియా వైడ్గా పెంచిన సమయం. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్ 1తో వచ్చి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టారు. ప్రభాస్ తో చేసిన సలార్ ఒక సంచలనం అని చెప్పకతప్పదు. ఇప్పటి వరకు ప్రభాస్ ని ఈ రేంజ్లో ఎలివేట్ చేసిన దర్శకుడు ఒక్క ప్రశాంత్ నీల్ మాత్రమే.
ప్రభాస్తో సలార్ సీక్వెల్ చేయాల్సి ఉంది. అలాగే, కేజీఎఫ్ సిరీస్లో మూడవ భాగం కూడా ప్రశాంత్ నీల్ చేయాలి. వీటికంటే ముందు మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ భారీ యాక్షన్ సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్ లో సాగే ఓ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తారక్ మూవీని తీర్చి దిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నాన్స్టాప్గా జరుగుతోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా 1969 నేపథ్యంలో సాగుతుందట.
అలాగే, చైనా.. బూటాన్ సరిహద్దు ప్రాంతాలలోనూ ఎక్కువభాగం షూటింగ్ జరపనున్నారట. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ ఈ సినిమా మీద అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. అయితే, తాజా సమాచారం మేరకు తారక్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్తో పాన్ వరల్డ్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఆ హీరో మరెవరో కాదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమాను చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ క్రేజీ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత బన్నీ సుకుమార్ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే కరమంలో ఇప్పుడు తెరపైకి ప్రశాంత్ నీల్ పేరు వచ్చింది. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సలార్ 2, కేజీఎఫ్ 3 చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు అనూహ్యంగా బన్నీతో సినిమా అంటే బాగా ఆలోచించాల్సిందే.