Saturday, October 5, 2024
HomeతెలంగాణUnesco Awards : తెలంగాణ ఆ రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

Unesco Awards : తెలంగాణ ఆ రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

తెలంగాణకు మరో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలను గుర్తించిన యునెస్కో.. అవార్డులు ప్రకటించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులకు ఎంపికయ్యాయి. ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’ కేటగిరీలో గోల్కొండ మెట్లబావి, ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీలో దోమకొండ కోట ఎంపికయ్యాయి. భారత్ కు వచ్చిన నాలుగు అవార్డుల్లో రెండు తెలంగాణకే దక్కడం గర్వించదగిన విషయం.

- Advertisement -

యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల నుండి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు అందగా..6 దేశాలకు చెందిన 13 కట్టడాలకు 5 కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. భారత్ కు నాలుగు, చైనాకు నాలుగు రాగా.. ఇరాన్ కు రెండు, థాయ్‌లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కొక్క అవార్డు దక్కించుకున్నాయి. ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ లభించగా, దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ లభించాయి.

మన హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత యుద్ధాల కారణంగా కోట దెబ్బతింది. కాలక్రమంలో సగభాగం వర్షాలకు కూలిపోయింది. ఇప్పుడు యునెస్కో అవార్డుకు ఎంపికైన బావిని పునరుద్ధరించేందుకు.. 2013లో పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ప్రభుత్వ చొరవతే బావి పునరుద్ధరణ జరిగింది. అలాగే దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరని ఈ కోటలో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోట సినీ నటుడు చిరంజీవి వియ్యంకుడు కామినేని అనిల్ కుమార్ అధీనంలో వుంది. రామ్ చరణ్ – ఉపాసనల పెళ్లివేడుక ఈ కోటలోనే జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News