Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూమా అంటే కార్యకర్తలకు ధీమా

Allagadda: భూమా అంటే కార్యకర్తలకు ధీమా

రాష్ట్రంలో టిడిపి  ప్రజల్లోకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడం ప్రజాబలం ఏ విధంగా పెరుగుతుందో అందరూ గమనిస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.  ఆళ్లగడ్డ పట్టణంలోని వైసీపీ కార్యకర్త బీరువాల భాస్కర్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవరాం టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. వారందరికీ మాజీ మంత్రి భూమ అఖిలప్రియ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అక్రమాలు కమిషన్లు రాజకీయాలు తదితర ఎక్కువైపోతున్నాయి తప్పా, ఎక్కడా కష్టపడిన పనిచేసిన కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి పార్టీలో విలువ లేదన్నారు.   పార్టీని నమ్ముకొని మారిన వారికి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో వారందరికీ ఆదరణ లేదని స్పష్టంగా తెలుస్తుందన్నారు, రాష్ట్రంలో  టిడిపి నాయకత్వం ఉంటేనే రాష్ట్రం  బాగుంటుందన్న ఒక నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు.  ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎప్పుడూ లేని నీచ రాజకీయాలు మొదలయ్యాయన్నారు. గతంలో ఎప్పుడో రౌడీయిజం గుడాయిజం చూశాం, మేమంతా మారిపోయాం, మంచి వాళ్ళుగా తయారయ్యామని గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచి ఇప్పుడు అధికారం చేతికి వచ్చాక ఆళ్లగడ్డ రాజకీయ రూపాలు చేశారని ఆమె ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి అధ్యక్షుడు గుండా మనోహర్ మాధవరెడ్డి ఇటిక్యాల శేఖర్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News