Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: కోవిడ్‌ తాజా పరిస్థితిపై జగన్‌ సమీక్ష

AP: కోవిడ్‌ తాజా పరిస్థితిపై జగన్‌ సమీక్ష

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.  కోవిడ్ రోగులకు గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు జగన్.  కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు  అధికారులు.  రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్ధాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించారు అధికారులు. ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్‌ చేసి  సిద్ధంచేసుకుంటున్నామన్నారు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్నారు.

ప్రతి విలేజ్‌ క్లినిక్‌కూ టెస్టింగ్‌ కిట్స్, మందులు పంపించాలని సీఎం అధికారులను ఈసందర్భంగా ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలని, ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలంటూ సీఎం ఆదేశించారు.  జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్షించారు.  మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శాంబశివారెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ బి చంద్రశేఖర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, డ్రగ్స్‌ డీజీ రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News