Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: పూలేకు ఘన నివాళి

KTR: పూలేకు ఘన నివాళి

తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూలే ఆశయ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ పాలన కొనసాగుతుంది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

- Advertisement -

సమాజ హితం కోసం ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నదని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నమన్నారు. అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూలే ఆశయ స్ఫూర్తిని కొనసాగిస్తామని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News