Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభErrabelli: 'బలగం' మొగిలయ్యను పరామర్శించిన ఎర్రబెల్లి

Errabelli: ‘బలగం’ మొగిలయ్యను పరామర్శించిన ఎర్రబెల్లి

బలగం సినిమా నటుడైన మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మొగిలయ్యకు మంచి వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

- Advertisement -

ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో నా తోడుగా నా తోడు ఉండి అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు, కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు. మోగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మంచి వైద్యం అందిస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మొగిలయ్య ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

మొగిలయ్యను కలిసిన వారిలో బి అర్ ఎస్ నాయకులు సాంబారి సమ్మారావు, బుడిగ జంగాల సంఘం నాయకుడు చింతల యాదగిరి, సీఎం ఓ ఎస్ డి డాక్టర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News