Thursday, September 19, 2024
HomeతెలంగాణGajwel: ప్రజలకు మాత్రమే గులాబీ పార్టీ గులాంగిరి

Gajwel: ప్రజలకు మాత్రమే గులాబీ పార్టీ గులాంగిరి

గజ్వేల్ అభివృద్ధి గజమాల వంటిదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలంతా గెలిపించాల్సిందేనన్నారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హాజరైన మంత్రి హరీశ్ రావు, గజ్వేల్ కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చాడని గుర్తుచేశారు. రాష్టంలో నాకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టినవారు ఒకరు ఎన్టీఆర్ మరొకరు కేసీఆర్ అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కేంద్ర ప్రభుత్వాలు నకలు కొడుతున్నాయని, దేశంలో మార్పు కోసం మన కేసీఆర్ బయలు దేరిండని, మన నినాదం ఒక్కటే రైతు నినాదం అంటూ హరీష్ రావు ప్రసంగించారు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తాం తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News