Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

Khammam: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురంలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి అతిథిగా హాజరయ్యారు.
ఈ సమ్మేళనంలో విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటరమణ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మహిళలు,యువతతో పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై భారత్”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News