మాజీ హోమ్ మంత్రి పట్లోళ్ల ఇంద్రా రెడ్డి 23వ వర్ధంతి వేడుకలను మొయినాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన స్మృతులను పంచుకున్నారు. గ్రామ సర్పంచ్ స్వప్న అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బాలరాజ్, మహేశ్వరి రాములు, నాయకులు వడ్డె నర్సింహులు, మల్లేష్, జైపాల్, బిక్షపతి, యాదయ్య, హరీష్, బీఆర్ఎస్ నాయకులు, ఇంద్రన్న అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.