Saturday, September 28, 2024
HomeతెలంగాణMallapur: ఈటల దిష్టి బొమ్మ దగ్ధం

Mallapur: ఈటల దిష్టి బొమ్మ దగ్ధం

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పిలపు మేరకు కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఎలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద తప్పడు ప్రచారం చేసిన ఈటెల రాజేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద యుద్ధం చేస్తూ ఎన్నో సార్లు జైలు పలు అయిన రేవంత్ రెడ్డి మీద తప్పడు మాటలు మాట్లాడిన ఈటెల రాజేందర్ నువ్వు పార్టీ మారి బీజేపీ లో చేరావు కేంద్రం లో మీ ప్రభుత్వం మే కదా ఉన్నది ఎందుకు కెసిఆర్. కెసిఆర్ కుటుంబం మీద కేసులు పెట్టడం లేదు కెసిఆర్ మీద అనేక ఆరోపణలు చేసిన నువ్వు ఎందుకు వాటిని నిరూపిచడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన తప్పడు మాటలకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పకపోతే రాజేందర్ ని ఎక్కడా తిరగకుండ చేస్తాం అని యువజన కాంగ్రెస్ నాయకులు హెచ్చరిచారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మల్లాపూర్ మండల యూత్ అధ్యక్షులు పోతు శేఖర్, సీనియర్ నాయకులు మర్రిపెల్లి మల్లయ్య, కోటగిరి ఆనంద్ గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు సోమ నాగార్జున రెడ్డి, సరికెళ్ళ నరేష్, ఎడ్ల నవీన్, మినుగు నరేష్, కోరుట్ల మండల ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, యువజన కాంగ్రెస్ నాయకులు జాగర్ల మహేష్, నానం రాకేష్, కసరపు రాజు గౌడ్, మదన్, శ్రీను, భుమేష్, రాజేష్ సత్యనారాయణ, శ్రీకాంత్, అరుణ్, అనిల్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News