Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన గంగుల

Allagadda: భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన గంగుల

ఆళ్లగడ్డ అర్బన్ పరిధిలో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పధకం క్రింద డ్రోన్ సహాయంతో భూ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరహరి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు సిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరు ప్రతాపరెడ్డి లతో కలిసి గంగుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద ఆళ్లగడ్డ అర్బన్ పరిధిలో డ్రోన్ సహాయంతో భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News