Saturday, October 5, 2024
HomeతెలంగాణDGP: సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణా పోలీస్ దేశంలోనే ముందంజ

DGP: సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణా పోలీస్ దేశంలోనే ముందంజ

సైబర్ నేరాలను అరికట్టడంలో పాటు సైబర్ సేఫిటి కీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో తెలంగాణా పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణా డీజీపీ అంజనీ కుమార్ తెలియచేసారు. న్యూఢిల్లీ నుండి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ -2023 అనే అంశంపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సదస్సులో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. National Architcture for Cyber Space management by State Government అనే అంశంపై డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, సైబర్ నేరాలను దర్యాప్తు చేసి, వాటిని అరికట్టేందుకై సైబర్ సేఫిటి బ్యూరో ను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణా అని అన్నారు. మైక్రోసాఫ్ట్ తోసహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని, దాదాపు 10 లక్షల మంది ఐటి ఆధారిత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సైబర్ లిటరేట్స్ గణనీయంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్నా మాదిరిగానే సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 2019 లో 2691 సైబర్ ఆధారిత కేసులు నమోదు కాగా, 2020 లో 5024 , 2021 లో 10,303 , 2022 లో 15,217 నమోదు అయ్యాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీ లో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించామని వివరించారు.

- Advertisement -

సైబర్ నేరాలను నియంత్రించేందుకై ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (T4C ) కీలక పాత్ర వహిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1930 , 100 ల ద్వారా సైబర్ నేరాల ఫిర్యాదులను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు సంబంధించి రూ. 65 కోట్లను నిలిపివేశామని అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకై పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్ లు ఎదుర్కొనేందుకై పోలీస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ వారియర్లుగా తయారు చేశామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News