Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: సయ్యద్ మీర్ రాకతో వైసీపీలో పుల్ జోష్

Athmakuru: సయ్యద్ మీర్ రాకతో వైసీపీలో పుల్ జోష్

ఆత్మకూరులో వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా సయ్యద్ మీర్ రాకతో వైసిపి ఫుల్ జోష్ లో ఉంది. గతంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన అంజాద్ చర్యలు నచ్చక, ఏక పక్ష నిర్ణయాలతో చాలామంది పార్టీకి దూరమయ్యారు. అంతే కాకుండా అంజాద్ అలీ కి వ్యతిరేకంగా సుమారు 22 మంది కౌన్సిలర్లు, దాదాపు వందల మంది నాయకులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఫిర్యాదు చేయడంతో అంజాద్ కి ఉద్వాసన పలికి కొత్త వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు షేక్ సయ్యద్ మీర్ ను ఎమ్మెల్యే నియమించడంతో వైసిపి పార్టీలో కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి ప్రతి నాయకుడిని, కార్యకర్తను, కలుపుకుంటూ పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు సయ్యద్ మీర్.జగనన్న మా భవిష్యత్తు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎమ్మెల్యే ఆదేశాలతో, శిల్ప భువనేశ్వర్ రెడ్డి చొరవతో వైసిపి పార్టీలోని నాయకులను, కౌన్సిలర్లను, వాలంటీర్లను, మహిళా నేతలను, సచివాలయ సిబ్బందిని కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.దీంతో ఆత్మకూరు పట్టణంలో వైసిపి జోరు మీద ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News