Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: బ్రహ్మ దీక్ష మాలతో పాదయాత్ర

Allagadda: బ్రహ్మ దీక్ష మాలతో పాదయాత్ర

ప్రపంచంలోని ప్రజలంతా శాంతియుతంగా తమ బ్రతుకు జీవనం సాగించి భగవంతుని ధ్యానంతో పరమాత్ముని చేరుకోవాలని, ప్రత్యేక ఆకాంక్షతో బ్రహ్మ దీక్ష మాల చేపట్టి భక్తులందరూ పాదయాత్రగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వెళుతున్నట్లు దీక్షబూనిన భక్తులు వెంకటేశ్వర్లు, పీరయ్య, జయరామయ్య, చిన్న జయరామయ్య లు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, మల్యాల గ్రామం నుండి సుమారు 140 మంది బ్రహ్మ దీక్ష మాల చేపట్టి గత 5 రోజుల నుండి పాదయాత్రగా వెళ్తున్నామని తెలిపారు. బ్రహ్మ దీక్ష చేపట్టిన మాతలు కూడా పాదయాత్రలో ఉన్నారన్నారు. కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు జీవ సమాధి అయినా గడియకు బ్రహ్మంగారిమఠం చేరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ పాదయాత్రలో భక్తులు విజయ్ కుమార్, రమేష్ బాబు, సురేష్, నాగార్జున, షేక్షావలి, పుల్లయ్య, సుశీలమ్మ జయమ్మ, లక్ష్మీ దేవి, మద్దమ్మ,బక్కమ్మ తదితర మాలధారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News