Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: లోకేష్ 10 సార్లు పాదయాత్ర చేసినా టిడిపి అధికారంలోకి రాదు

Emmiganuru: లోకేష్ 10 సార్లు పాదయాత్ర చేసినా టిడిపి అధికారంలోకి రాదు

యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న పప్పు మాటలు మాట్లాడుతూ పప్పుగా పేరు సంపాదించుకున్న నారా లోకేష్ 10 సార్లు పాదయాత్ర చేసిన టిడిపి అధికారంలోకి రాదని ఎమ్మిగనూరు
ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో చెన్నకేశవరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కు వృద్ధాప్యం వచ్చాక నశించిపోతుంది. లోకేష్ ఎన్ని నియోజకవర్గాలు తిరిగినా టిడిపి శ్రేణులు మాత్రం లోకేష్ వద్దు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ కోరుతున్నారు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ చేతికి టిడిపి వెళుతుందని అన్నారు. లోకేష్ పప్పు అని పేరు తెచ్చుకొన్నారని, పప్పు మాటలును ప్రజలు నమ్మరన్నారు. టిడిపి ప్రభుత్వం హయంలో కేవలం అభివృద్ధి పనుల మంజూరు పత్రాలు మాత్రమే తెచ్చుకొని కమీషన్లు దండుకున్నారనీ ఆరోపించారు. పులికనుమ ప్రాజెక్టు మంజూరుకు తనే స్వయంగా అప్పటి సీఎం వైయస్సార్ తో 246 కోట్లు మంజూరు చేయించాను. అయ్యితే ఇది తెలియని నారా లోకేష్ పులికనుమ ప్రాజెక్టు మేమే సాదించామని చెప్పుకోవడం హాస్యస్పదమన్నారు. అదే విధంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, తిప్పనూరు బ్రిడ్జ్, నాగలదిన్నె బ్రిడ్జి, AIIB స్కీమ్ కింద జిడిపి నుంచి ఎమ్మిగనూరు కు మంచినిటి సరఫరాకై 142 కోట్లు, వంద పడకల ఆసుపత్రికి నిధుల మంజురు చేయించి, అభివృద్ధి పనులు చేపట్టుతున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నికే దక్కుతుందని పేర్కొన్నారు.ఈ పనులకు సంబంధించి టీడీపీ చేపట్టిందాని చేప్పుకోవడం శోచనీయం అన్నారు. తెలిపుతున్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతు పేపర్ పులి గా ఉన్న బీవీ ను ఎమ్మిగనూరు ప్రజలు నమ్మరు.సమావేశంలో వైసిపి నేత ఎర్రకొట జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News