ప్రధాని మోడీకి మూడిందని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధమౌతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణా భవన్ లో జరిగిన బిఆర్యస్ పార్టీ ప్లీనరీ అనంతరం తెలంగాణా భవన్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కుడా పనికి రాకుండా పోయిందని ఆయన ఎద్దేవాచేశారు. ప్రజల ఎజెండాతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకీ అడుగిడుగుతున్నారన్నారు. ఎత్తుగడలలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని, ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వెయ్యeలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన స్పష్టం చేశారు. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. అటువంటి ఎత్తుగడలతో తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోటే దేశ రాజకీయాల్లోకి అని ఆయన తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,యన్.రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,యన్.భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు
Jagadish Reddy: మోడీకి మూడింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES