Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR @ BRS pleanary: కేటీఆర్ ప్రసంగంలోని హైలైట్స్ ఏంటో తెలుసా?

KTR @ BRS pleanary: కేటీఆర్ ప్రసంగంలోని హైలైట్స్ ఏంటో తెలుసా?

బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా తీర్మానాలను ప్రవేశపెట్టారు కేటీఆర్. ఈ సందర్భం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి….
• జల దృష్యం నుంచి సుజల దృష్యం దాకా మన పార్టీ ప్రగతి ప్రస్థానం కొనసాగుతోంది.
• ఇదంతా మన అధ్యక్షులు సిఎం కేసీఆర్ గారి దార్శనికతతోనే సాధ్యమైంది.
నీను ఇటీవల వొక పెద్ద మనిషిని కలిసినపుడు వారు …మీ ముఖ్యమంత్రిలో ఉద్యమాకారుడే కాదు మంచి పరిపాలనాధక్షడున్నారు. ఇట్లా రెండూ కలిసి వుండడం చాలా అరుదు అని కొనియడారు.
మన పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం… సమగ్ర.. సమతుల్య,,సమీకృత..సమ్మిళిత..అభివృద్ధి విధానం.
డేటా లేకుండా చేసే పాలన అనేది కరెక్టు కాదు. అనేది మన సిఎం గారు నమ్మిన అంశం. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే సకల జనుల సర్వే నిర్వహించి జనాభా గణాంకాలతో అభివృద్ధిని సుసంపన్నం చేశారు.
• దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో పంచాయితీరాజ్ శాఖలో 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నది.
ప్రజలకు ఏం కావాలో వారేం కోరుకుంటారో అనేది మన అధినేతకు తెలిసినంతగా ఇతరులకు తెలవదనేది మేధావులు చెప్తున్న అంశం. అందుకే తెలంగాణ లో ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.
పల్లెలే కాదు పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. పారిశ్రామీకరణ పర్యావరణ హితంగా కొనసాగుతున్నది. ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగింది. విద్య వైద్య విద్య గురుకులాలు ఏర్పాటు వేరే ఏరాష్ర్ట్రంలో కూడా ఇంతగా లేవు.
• దేశ 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో… తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో వొకే వొక స్టార్టప్ స్టేట్ ఎదిగింది. ఇది మనందరికీ గర్వ కారణం.
మౌలిక వసతుల కల్పన అనేది అభివృద్ధికి మూలం అని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ అన్నారు. దేశంలో సహజ వనరులను వాడుకునే తెలివున్న ప్రభుత్వాలే లేవు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని సిఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే దేశమంతా గొప్పగా స్పందిస్తున్నది. మహారాష్ర్ట్రలో విజయవంతమౌతున్న సభలే అందుకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం…శ్వేత నీలి పింక్ యెల్లో ఇట్లా 5 విప్లవాలతో ప్రగతిని సాధిస్తున్నది.
4.5 లక్షల కోట్ల రూపాయాలను కేవలం వ్యవసాయం దానికి అనుబంధ రంగాలకే ఖర్చు చేయడం దేశంలోనే ఎన్నడూ జరగలేదు.
పాలకు జిఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అదానికి ఇచ్చిన పోర్టులకు ఎందుకు చేయట్లేదో చెప్పాలి.
యువతను రాజకీయాల దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం వున్నది. పొద్దున లేస్తే ప్రతి అంశాన్ని,,మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు..రేపటితరం రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరమున్నది. భారత దేశంలో మానవ వనరులున్నయి సరియైన రీతిలో దిశానిర్దేశం చేయాలె.
• అప్పులు తేవడం అనేది ఏదో తప్పుగా మాట్లాడుతున్న వాల్లు గుర్తుంచుకోవాల్సిందేందంటే…దుబారా ఖర్చుకోంస అప్పులు చేయడంలేదు…పునరుద్పాతకతకోసం చేస్తున్న అప్పు దేశ సంపదను పెంచుతది. తెలంగాణలో అదే జరుగుతున్నది. అది అప్పుకాదు పెట్టుబడి.
మన తల్లిదండ్రులు జీవితచమరాంకంలో ఇల్లు కట్టుకునే వాల్లు కానీ నేటి ఐటి తరం ఉద్యోగం రాంగనే లోన్ తెచ్చుకోని ఇల్లు కట్టుకుంటుండు. లోన్ తెచ్చుకోని వ్యాపారం చేస్తుండు. వారికి అప్పు తీర్చగలమనే భరోసా వచ్చింది కావట్టే వారు అభివృద్ధి చెందుతున్నరు,. దేశంలోని కేంద్ర పాలకులు ముఖ్యంగా బిజెపి వంటి ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరిస్తే దేశం ఎప్పుడో 5 ట్రిలియన్ మార్కును దాటేది.
ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాలు …అదే సందర్భంగా అత్యంత ధనవంతమైన దేశాలు రెండూ కూడా అమెరికా జపాన్లే నన్న సంగతి ..ఈ కువిమర్మకులకు అర్థం కావాల్సి వున్నది.
అందుకే మన అధినేత సిఎం కేసఆర్ గారు చెప్పినట్టు నూతన ఆర్ధిక విధానం తక్షణావసరం. విజన్ ఫర్ నయా భారత్ పేరిట మన అధినేత దార్శనికతతో మనం ముందుకు పోతున్నం.
• ఇప్పడు దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు…డబుల్ ఇంపాక్ట్ సర్కార్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News