Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: డాక్టరేట్ అవార్డు అందుకున్న వడ్ల సుమంతా చారి

Kalluru: డాక్టరేట్ అవార్డు అందుకున్న వడ్ల సుమంతా చారి

అతి చిన్న వయసులో డాక్టరేట్ అవార్డును పొందిన వడ్ల సుమంతా చారిని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు వాసి అయినటువంటి వడ్ల సుమంత్ ఆచారి అనే యువకుడు నిరంతరము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటాలు చేస్తూ అతనికి ఉన్నంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజాసేవ చేస్తూ సోషల్ ఆక్టివిటీస్ అందరికంటే ముందు నిరంతరం శ్రమిస్తున్నటువంటి వడ్ల సుమంతా చారి కి డాక్టర్ రావడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని రాబోయే రోజుల్లో ఇంకో ఎన్నో అవార్డులు పొందాలని ప్రజాసేవలో ఇంకా ముందడుగు వేయాలని పేద ప్రజలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆ భగవంతుడు వడ్ల సుమంతా చారి కి మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అభినందించారు. వడ్ల సుమన్ ఆచారి లాంటి యువకులు ఎంతోమంది సమాజసేవలో పాల్గొని దేశ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి యూత్ కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్ల శివశంకరాచారి, వెంకటస్వామి, సూర్య ప్రకాష్ ఆచారి, రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News