Friday, September 20, 2024
HomeతెలంగాణMoinabad: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం

Moinabad: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం

మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామ పంచాయతీకి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వైకుంఠ రథాన్ని విరాళంగా అందజేశారు ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎలిగేపల్లి శ్రీనివాస్ యాదవ్. బాకారంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన వారిని మనం ఎన్నటికీ తిరిగి తీసుకు రాలేమని, వారు పంచిన ప్రేమాను రాగాల జ్ఞాపకార్థం ప్రజోపయోగ కార్యక్రమాలు చేసినప్పుడే వారి ఆత్మకు నిజమైన శాంతి చేకూర్చిన వారమవుతామని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండకళ్ళ హరినాథ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణపురం కర్ణాకర్ ముదిరాజ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంది అనిల్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొండుపల్లి రాములు, బంది శేఖర్ ముదిరాజ్, కావలి భుజంగం ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎర్ర సదానందం, వార్డు సభ్యులు నారాయణపురం మహేందర్ ముదిరాజ్ గారు వార్డు సభ్యులు పంచలింగాల శ్రీనివాస్ రెడ్డి గారు వార్డు సభ్యులు సిరిగిరి శ్రీనివాస్ గారు మంగలి శంకరయ్య, బద్దుల స్వామి యాదవ్ గారు బద్దుల వెంకటేష్ యాదవ్, కావలి భుజంగం ముదిరాజ్, యాతం రమేష్ ముదిరాజ్, కొండకళ్ళ మహేందర్, కావలి కిరణ్ ముదిరాజ్, యాతం శేఖర్ ముదిరాజ్, కావలి దయాకర్ ముదిరాజ్, ఎలిగేపల్లి సురేష్ యాదవ్, సిరిగిరి కుమార్, కొమ్మిడి సిద్ది రెడ్డి, చాకలి ఎర్ర అంజయ్య, మాల రాములు, వడ్డే సంతు, సిరిగిరి శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News