మిథిలా పాల్కర్..1993 జనవరి 11న ముంబైలో జన్మించింది.
ఈమె తొలిసారి 'మజా హనీమూన్' అనే లఘు చిత్రంలో నటించింది.
2015లో 'కట్టి బట్టి' సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'లిటిల్ థింగ్స్' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
2022లో వచ్చిన 'ఓరీ దేవుడా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలుగులో 'సూపర్ సుబ్బు' అనే మూవీలో నటిస్తోంది.
ఈమె నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అందాల విందు చేసింది.