Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: కొత్త సెక్రెటేరియట్ లో తమ ఛాంబర్ లో ఆశీనులైన మంత్రులు

Hyd: కొత్త సెక్రెటేరియట్ లో తమ ఛాంబర్ లో ఆశీనులైన మంత్రులు

నూతన సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ కి సంబంధించిన మే నెల బాకాయిలు 958 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ సంతకం చేశారు.

- Advertisement -

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ఫైలుపై తొలిసంతకం, నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనల ఫైలుపై మలిసంతకం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సంధర్భంగా ఛాంబర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.

సచివాలయంలో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీనులైన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైల్ పై మొదటి సంతకం చేసిన మంత్రి హరీశ్ రావు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్ పై సంతకం చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.

డాక్టర్. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని నాల్గవ అంతస్తు లోని తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సీట్లో ఆసీనులయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తు ఫైల్ పై సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైల్ పై సంతకం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News