Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP: లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన సిపిఎం నేత అంబేత్కర్

TDP: లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన సిపిఎం నేత అంబేత్కర్

ఎమ్మిగనూరు పట్టణ సిపిఎం నాయకులు అంబేత్కర్ టిడిపి లో చేరారు. ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి గ్రామం వద్ద యువగలం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన అంబేద్కర్ కు టిడిపి కండువా వేసి ఆహ్వానించారు. సిపిఎం పార్టీతో పాటు అనుబంధ సంఘాలలో పని చేశానని సిపిఎం పార్టీ సిద్ధాంతం మంచిదైనప్పటికీ ఎంతో ప్రజాధరణ కలిగిన తెలుగుదేశం పార్టీతో విస్తృతమైన సేవ చేయడానికి అవకాశం కలుగుతుందని భావించి టిడిపిలో చేరినట్లు అంబేత్కర్ తెలిపారు. నాకు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని జయ నాగేశ్వర్ రెడ్డితో చర్చించామని ఆయన అంగీకరించి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం సారథి నారా లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా టిడిపిలో చేరాలని తెలిపారు. అందులో భాగంగా రాళ్లదొడ్డి విడిది ప్రాంతంలో 100 మందితో జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేసి జయ నాగేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందుకు తగిన కృషి చేయాలని వారన్నారు. అనంతరం నాయకంటి అంబేద్కర్ మాట్లాడుతూ జయ నాగేశ్వర్ రెడ్డి గారిని గెలిపించుకునేలా నాకు ఏ భాద్యత అప్పజెప్పినా ఎంతో నిబద్ధతతో చేసి గెలుపే లక్ష్యంగా ప్రయత్నం సాగిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాజు మహేష్ మనోహర్ జార్జి బీమా ప్రవీణ్ సూరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News