Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్BVJR: లోకేష్ యువగళం విజయవంతం

BVJR: లోకేష్ యువగళం విజయవంతం

టిడిపి అధ్వర్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విజయవంతం అయిందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, బీవీ జయనాగేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం ఇబ్రహీంపురం నుండి ఏప్రిల్ 28 వ ప్రారంభమై కోట్టాల, మాచాపురం, నందవరం, ముగతి, ఎమ్మిగనూరు, ఎర్రకోట, రాళ్ళదొడ్డి, గోనెగండ్ల, హెచ్ కైరవాడి, పుట్టపాసం, వేముగోడు వరకు మే 2 వ తేదీన వేముగొడులో ముగిసింది. 5 రోజుల పాటు సాగిన లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఇందుకు సహకరించిన కర్నూలు జిల్లా టిడిపి కమిటీకి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు, టిడిపి నాయకులు కార్యకర్తలు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు, కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News