Friday, September 20, 2024
HomeతెలంగాణKavitha: గులాబీ సైనికుడికి ఇది గర్వకారణం

Kavitha: గులాబీ సైనికుడికి ఇది గర్వకారణం

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించిందనే విషయాన్ని గుర్తుచేశారు కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయంటూ ట్వీట్ చేసిన కవిత, సీఎం కెసిఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుంది. 9 మంది లోక్సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందన్నారు.

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమన్న కవిత, సీఎం కేసీఆర్ గారి దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయన్నారు. ఇక తన కాలికి గాయం కావటంతో గత కొన్ని రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కవిత సోషల్ మీడియా ద్వారా తన మద్దతుదారులకు సందేశాలు తరచూ పంపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News