Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ కు థ్యాంక్స్ చెప్పిన సాక్షర భారత్ సమన్వయకర్తలు

AP: జగన్ కు థ్యాంక్స్ చెప్పిన సాక్షర భారత్ సమన్వయకర్తలు

సాక్షర భారత్‌లో పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలగించిన మండల సమన్వయకర్తలు 500 మందిని స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌లో మండల సమన్వయకర్తలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సాక్షర భారత్‌ మండల కోఆర్డినేటర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ప్రసాద్, బాపేశ్వరరావు.

- Advertisement -

సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున సుమారు 11 వేల మంది గ్రేడ్‌ 3 సర్వేయర్లను గ్రేడ్‌ 2 సర్వేయర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సర్వే ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ విఎస్‌ దివాకర్, సర్వే ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌. చిరంజీవి రావు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News