Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: నారా లోకేష్ పై కాదు ముందు నాపై గెలవండి

Emmiganuru: నారా లోకేష్ పై కాదు ముందు నాపై గెలవండి

నారా లోకేష్ పై కాదు ముందు నాపై పోటీ చేసి, గెలిస్తే.. నేను, నా కుటుంబం రాజకీయాలు నుంచి పూర్తిగా తప్పుకుంటుందని స్థానిక టీడీపీ నేత జయనాగేశ్వర్ రెడ్డి సవాలు చేశారు. భూ మాఫియా డబ్బుతో లోకేష్ యువగళం పాదయాత్రకు ఖర్చు చేశారని నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మిగనూరు వైసిపి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిపై జయనాగేశ్వర్ మండిపడ్డారు. ముందుగా మీరు వైసీపీ టికెట్ తెచ్చుకుంటే సంతోషిస్తాని, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి సవాలు విసిరారు. స్థానిక బీవీ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముందుగా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వృద్దాప్యంలో కూడా టికెట్ తెచ్చుకుంటాను నాపై పోటీ చేసి గెలవాలని ప్రగాల్బాలు పలకడం సిగ్గుచేటన్నారు. ఎమ్మిగనూరు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సిద్ధంగా ఉన్నానని ముందు మీరు ఈ జయనాగేశ్వరరెడ్డిపై గెలవాలని సవాల్ చేశారు.
కడిమెట్ల గ్రామంలో దేవుడి భూమిని లీజుకు తీసుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతులు ఉన్నట్లు ఆధారలుంటే చూపాలని అన్నారు. ఆ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని ఎలా తరలిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.అదే కడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్ 707 లో రాళ్ళ గుట్ట 76 ఎకరాల 86 సెంట్ల భూమి అసెస్ మెంట్ కాని మిగులు భూమిని ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వారికి పంచివ్వాలన్నారు. అలా కాకుండ చుట్టూ ఉన్న తాపేదారులు ఎకరాకు ఇంత చొప్పున వసూలు చేసి అప్పజెప్పుచు న్నారన్నారు. రియల్ ఎస్టేట్ దందా మాదిరి అనుచరులకు 5,6 ఎకరాలు చొప్పున కట్టబెట్టే దానికన్నా పట్టాల రూపంలో పేదలకు పంచివ్వాలరు. వీటీపైన లోకేష్ బాబు సూటిగా ప్రశ్నిసిస్తే జవాబివ్వకుండా ఏవో మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ ను ఎమ్మెల్యే పప్పుగాడని అంటున్నారు. నాలుగుసార్లు మీరు,ఒక సారి మీ కొడుకు ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి.మొదటి సారి ఓడిపోతే కందిపప్పు అనాల,రెండవ సారి ఓడిపోతే శనగ పప్పు అనాలా, మూడోసారి ఓడిపోతే ఇంకో పప్పు అనాలా,2014లో మీ తనయుడు నా చేతిలో ఓడిపోయారని మరి ఆయన్నేమనాలి ముద్ద పప్పు అనాలా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మిగనూరు లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుండి ఎకరాకు 2 నుండి 4 లక్షలు వసూలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి. భూ కబ్జాలు చేస్తున్న నిన్ను శాశ్వితంగా రాజకీయాల నుంచి ప్రజలు పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఆయురారోగ్యాలతో బాగా బలంగా ఉండి, టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థిగా బివి. జయ నాగేశ్వరెడ్డి పోటీకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News