Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Ahobilam: లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జాయింట్ కలెక్టర్

Ahobilam: లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జాయింట్ కలెక్టర్

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు నంద్యాల జాయింట్ కలెక్టర్ నిశాంతి. అహోబిలం చేరుకున్న జాయింట్ కలెక్టర్కు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తాసిల్దార్ హరినాధరావు డిప్యూటీ తాసిల్దార్ రవీంద్ర ప్రసాద్, ఆర్ఐ ,ప్రసాద్ సివిల్ సప్లై అధికారి ఎం వి ఎస్ ఎస్ శేఖర్ రెడ్డి సర్వేయర్ రవి ప్రకాష్, వి ఆర్వో పరమేశ్వర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నిశాంతి కుటుంబ సభ్యులతో కలసి వైశాఖ నరసింహ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నేడు ఎగువ అహోబిలం లో స్వామివారికి చక్రస్నానం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .జ్వాలా నరసింహస్వామిని శ్రీదేవి ,భూదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరుదుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ అర్చకుడు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News