Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఆర్థిక మంత్రి బుగ్గనను కలిసిన జిల్లా ఎస్పీ

Kurnool: ఆర్థిక మంత్రి బుగ్గనను కలిసిన జిల్లా ఎస్పీ

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కర్నూలు జిల్లా ఎస్పీ బి. కృష్ణకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు బి. క్యాంపులోని పోలీసు అతిథి గృహంలో మంత్రి బుగ్గనను కలిసి ఎస్పీ పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో మంత్రి బుగ్గన, ఎస్పీ కృష్ణకాంత్ లు జిల్లాలోని శాంతిభద్రతలపై చర్చించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై మంత్రి ఎస్పీకి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News