Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Manipur Telugu students: స్పెషల్ ఫ్లైట్ లో మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Manipur Telugu students: స్పెషల్ ఫ్లైట్ లో మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు ముమ్మరంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈమేరకు స్పెషల్‌ ఫ్లైట్‌ ఏర్పాటుకు అంగీకరించింది సివిల్‌ ఏవియేషన్‌ శాఖ.
మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు.

- Advertisement -

వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News