Friday, September 20, 2024
HomeతెలంగాణVirnapally: బీఎస్పీ బహిరంగ సభకు తరలి వెళ్లిన ప్రజలు

Virnapally: బీఎస్పీ బహిరంగ సభకు తరలి వెళ్లిన ప్రజలు

బి ఎస్ పి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు వీర్నపల్లి వాసులు తరలివెళ్లారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగే భారీ బహిరంగసభ కు బయలు దేరి వెళ్లిన వీర్నపల్లి మండల బీఎస్పీ పార్టీ శ్రేణులు. ఉత్సాహం కనబరిచారు. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు వీర్న పల్లి మండలం నుంచి దాదాపు 200 మంది వరకు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, వారి వారి వాహనాల్లో బయలు బయలు దేరివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గోనున్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీకి అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొంటున్నారు. నియోజక వర్గ కార్యదర్శి ఇసంపల్లి కొమురయ్య, బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల ప్రశాంత్, వీర్న పల్లి మండల సెక్టార్ అధ్యక్షుడు కన్నం జనార్ధన్, గర్జన పల్లి బూత్ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు తడగొండ సాయిలు, మానువాడ భూమయ్య, నగరపు పోచయ్య, నగరపు కృష్ణ, గుమ్మడి గణేష్, జితేందర్, దిలీప్, రాములు, మధు, మహేష్, రఘు తదితరులు హైదరాబాద్ కు వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News