Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRana Daggubati : ఇండిగో విమానాయ సంస్థపై రానా ఆగ్రహం.. ఏం చేసిందో తెలుసా??

Rana Daggubati : ఇండిగో విమానాయ సంస్థపై రానా ఆగ్రహం.. ఏం చేసిందో తెలుసా??

- Advertisement -

Rana Daggubati : ఇటీవల సెలబ్రిటీలు బయట ఏదైనా పనిలో తమకి అసహనం కలిగితే వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బ్రహ్మాజీ, అనసూయ ఎయిర్ లైన్స్ మీద కంప్లైంట్స్ చేస్తూ విమానాలు ఆలస్యంగా వచ్చాయని, లగేజ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని ట్వీట్స్ చేశారు. తాజాగా ఈ సారి దగ్గుబాటి రానా ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేశాడు.

హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి రానా బెంగళూరు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మరో విమానంలో బెంగళూరుకు వెళ్లారు. లగేజ్ ఇంకో విమానంలో వస్తుందంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే బెంగళూరు చేరుకున్నాక ఎంతసేపటికి లగేజి రాకపోవడంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రానా ట్విట్టర్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ యాడ్స్ పోస్టులని షేర్ చేస్తూ వాటిపై సెటైరికల్ గా వరుస ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ లో.. ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైంది. ఇండిగో విమాన వేళలు సరిగా లేవు. మిస్సైన లగేజి ట్రాకింగ్ సరిగా లేదు. సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు. ఇండిగో ఇంజనీర్లు బహుశా మంచి సిబ్బందే కావచ్చు, కానీ వారికి సరైన సూచనలు చేయడం అవసరం అని ట్వీట్ చేశారు.

అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ కి చెందిన మరో పోస్ట్ షేర్ చేసి.. షెడ్యూల్ చేసిన విమానాలు ల్యాండ్ కాకపోవచ్చు లేదా టేకాఫ్ కాకపోవచ్చు, ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News