Friday, October 18, 2024
Homeనేషనల్Elections: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎమ్మిగనూరు వాల్మీకి నేతలు

Elections: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎమ్మిగనూరు వాల్మీకి నేతలు

కర్ణాటకలో జరుుతున్న సాధారణ ఎన్నికలలో వివిధ పార్టీల తరుపున పోటీ చేస్తున్న వాల్మీకి సామాజిక వర్గం వారిని గెలిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి తెలుగు దేశం పార్టీ ( టిడిపి ) నాయకులు ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ విజీఏ దయాసాగర్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దయాసాగర్, రామకృష్ణ నాయుడుతో పాటు వారి అనుచరులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బళ్ళారి రూరల్ నుండి బీజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాల్మీకి శ్రీరాములు, సిరుగుప్పలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న బీఎన్ నాగరాజు, రాయచూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న తిప్పరాజు, సండురులో ( కేఅర్పీపీ) గాలి జనార్దన్ రెడ్డి పార్టీ తరపున పోటీ చేస్తున్న కేఎస్ దివాకర్ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బళ్ళారి, సిందునురు, సిరుగుప్ప, సండురు లో వాల్మీకి సామాజిక వర్గ అభ్యర్థులను కలిసి మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా వాల్మీకి అభ్యర్థులను గెలిపించాలని కర్ణాటక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News