Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP: దేవుని భూములు కొట్టేసిన చెన్నకేశవ రెడ్డి బుకాయించవద్దు

TDP: దేవుని భూములు కొట్టేసిన చెన్నకేశవ రెడ్డి బుకాయించవద్దు

ఎమ్మిగనూరులో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, ఆయన తనయుడు వైసిపి నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇస్తూ బుకాయిస్తున్నారని ఎమ్మిగనూరు టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మిగనూరు, నందవరం టిడిపి నాయకులు రామదాసు గౌడ్, మిఠాయి నరసింహులు, సుందర్ రాజు, వీజీఏ దయాసాగర్, కలిముల్లా, రంగస్వామి గౌడ్, నేసే మల్లికార్జున, ఈరన్న గౌడ్, గడ్డం నారాయణ రెడ్డి, కాశీమ్ వలి, చిన్న రాముడు, దార్మపురం గోపాల్ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి భూ దందా చేస్తున్నాడని, అలాగే కడిమెట్లలో చెన్నకేశవ స్వామి దేవుని భూములను లీజుకు తీసుకొని శిస్తు చెల్లిస్తున్నానని చెప్పారు. చెప్పిన 2 రోజుల్లోనే ఆయన తనయుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి మీడియాలో మాట్లాడినప్పుడు ఆ భూములు మా తాత ముత్తాతల నుండి మా అనుభవంలో ఉన్నాయని చెప్పినట్టు వీరు ఆరోపించారు. మీ పై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, దేవుని భూములు కబ్జాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి, లేకపోతే మీరు చేస్తున్న చీకటి వ్యవహారాలను ఒప్పుకోవాలి, మీ అల్లుడు బీఅర్ బసిరెడ్డి మరోలా మాట్లాడారు, కడిమెట్ల దేవుని భూములను లీజుకు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారంటూ వారు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు దరఖాస్తు చేయలేదన్నారు. చెన్నకేశవ రెడ్డి మాత్రం లీజు తీసుకొని శిస్తు కడుతున్నామని చెప్పారు. వీరు చెప్పిన మాటలు వేరువేరుగా ఉండటమే వీరి మాటలు అపద్దలనేందుకు నిదర్శనమని టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రామకృష్ణ నాయుడు, తురేగల్ నజీర్ అహ్మద్, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, కొండ మీద మునీర్, బోయ రంగన్న,బోయ అంజి,వడ్డే కృష్ణ,శిల్పి భాస్కర్, దేవేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News