Friday, October 18, 2024
HomeతెలంగాణManchiryala: దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు కేటీఆర్ భూమి పూజ

Manchiryala: దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు కేటీఆర్ భూమి పూజ

మంచిర్యాలలోని కాసిపేట మండలం దేవపూర్ ఓరియంటల్ సిమెంట్ కంపెనీలో సుమారు 2,000 కోట్లతో చేపట్టిన 4వ ప్లాంటు విస్తరణలో భాగంగా భూమి పూజా కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హోమ్ శాఖ మంత్రి మొహ్మద్ అలీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, స్థానిక సర్పంచ్ మాడవి తిరుమల, సర్పంచ్ ఆడ జంగు, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News