Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: కాశింతల క్షేత్రంలో నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ట

Allagadda: కాశింతల క్షేత్రంలో నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ట

ఆళ్లగడ్డ పట్టణ శివారులో వక్కుళా నది ఒడ్డున వెలసిన సూపసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశింతల శైవ క్షేత్రంలో నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాశింతల క్షేత్రంలో నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల ఇందిరా ప్రభాకర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. కాశింతల క్షేత్రానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా విగ్రహం పునఃప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, ఆళ్ళగడ్డ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపవరం నర్సింహా రెడ్డి, కోట కందుకూరు వైఎస్సార్సీపీ నాయకులు దామోదర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గాజుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News