Tuesday, September 17, 2024
HomeతెలంగాణSathupalli: కేటీఆర్ ని కలిసిన సండ్ర

Sathupalli: కేటీఆర్ ని కలిసిన సండ్ర

మంత్రి కేటీఆర్ ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కలిశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ కేటీఆర్ ని హైదరాబాదులోని సచివాలయంలో వారి ఛాంబర్లో సండ్ర కలిసి, వినతి పత్రాన్ని అందజేసారు. సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి 60 కోట్ల రూపాయల నిధులను అందించిన కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ఆయన, 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేయాలని కోరుతూ ఆహ్వానం పలికారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో మండలాల వారిగా నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News