Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Media & Freedom: మీడియా స్వేచ్ఛలో జోక్యం వద్దు

Media & Freedom: మీడియా స్వేచ్ఛలో జోక్యం వద్దు

భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పౌరులు అనుభవిస్తున్న స్వేచ్ఛ క్రమంగా దిగజారిపోతుంది. రా జ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగ మైన మీడియా( పత్రికా) స్వేచ్ఛకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. తద్వారా మీడియా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వాస్తవాలు చెప్పే హక్కు కలిగి ఉంది. దీన్ని అడ్డుకుంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడ నుంది. అందుకే ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛను నాలుగో స్తంభం (ఫోర్త్‌ ఎస్టేట్‌)గా పేర్కొంటారు. ఈ మీడియా( పత్రికా) స్వేచ్ఛ యాజమాన్యాలకు ఇచ్చింది కాదు. ప్రభుత్వాల, వ్యవస్థీకృత వర్గాల నుండి ఆంక్షలు, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సరైన రీతిలో సంపూర్ణంగా వార్తలను సేకరించడం, ప్రచురించడంలో నిజాయితీగా వ్యవహరించాలి. మీడియా, పత్రిక స్వేచ్ఛ అంటే? దేశ పౌర, రాజకీయ, మత, స్వాతంత్య్ర, స్వేచ్ఛ పరిరక్షణ ‘కల్ప వృక్షం’. ఈ ప్రజా కల్ప వృక్షాన్ని ప్రశ్నించ డానికి న్యాయస్థానాలకు, చట్టసభలకు కూడా వీలుండదు. ఎంతో విశిష్టతను, స్వతంత్రతను కల్పించారు రాజ్యాంగ నిర్మాతలు. ప్రజలకు వాస్తవాలు తెలిపే హక్కు మీడియాకు ఉంది. కఠిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచితేనే, వారు సరైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకుంటారు. అలా మీడియా ఎన్నో సంస్కరణలకు, సామాజిక, రాజకీయ మార్పులకు దోహద పడింది.. పడుతుంది. ఈమధ్య మళ యాల వార్త ఛానల్‌ ‘మీడియా వన్‌” పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ, ప్రజాస్వామ్య మను గడకు.. మీడియా స్వతంత్రత ముఖ్యమని ‘సుప్రీం’ భావించి తీర్పును వెలువరించింది. విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఎలా అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యా నికి ప్రాణవాయువైన మీడియా స్వేచ్ఛలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం భావ్యం కాదు. ప్రపంచంలో భారత దేశ స్థానం మీడియా స్వేచ్ఛలో దిగజారి(పడి)పోతుంది.. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలు, స్వతంత్ర మీడియా సంస్థలను, సంపాదకీయ వర్గాన్ని, జర్నలిస్టుల మీద ఉగ్రవాదం, రాజద్రోహం లాంటి కఠిన శిక్షల కింద తప్పుడు కేసులను బనాయించడమే కాకుండా దాడులు, హత్యలు జరుగుతున్నాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ ఆర్‌ డబ్ల్యు) పేర్కొంది. అలాగే ఈ మధ్య అధ్యయనం చేసిన పారిస్‌ చెందిన స్వంతంత్ర ఎన్‌జీఓ రిపోరట్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌, రిపోర్టర్స్‌ సాన్స్‌ ప్రాంటియర్స్‌ మరియు (ఆర్‌ ఎస్‌ ఎఫ్‌ ) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్‌, సామాజిక మరియు భద్రత లాంటి ప్రధాన అంశాలు, మీడియా స్వేచ్ఛ సూచీల మీద ‘ప్రపంచ పత్రిక దినోత్సవం మే-3న‘ నివేదికను విడుదల చేసింది. ఆ మేరకు 21వ ఎడిషన్‌ వర ల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ లో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్‌ 2023 సం.లో 161 స్థానంతో బలహీన ర్యాంకులో ఉంది. మన కన్న చిన్న దేశాల కన్నా దిగజారి పోవడంతో.. ఇది ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా గతంలో 2009వ సం.లో 105వ ర్యాంకులో ఉం డేది. 2019 నాటికి దాని పరిస్థితి 140వ ర్యాంకుకు దిగ జారిపోయింది. ఆ తరువాత 2020-21 నాటికి భారత ర్యాంకు 142కు, 2022 నాటికి 150వ స్థానానికి పడి పోయింది. తాజాగా 2023 కి వచ్చేసరికి, ఇంతకన్నా 11 స్థానాలు దిగజారి 161వ స్థానానికి కుదేలయింది. మన పొరుగు దేశాలు భూటాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, మయ న్మార్‌ కన్నా తక్కువ స్థానాల్లో ఉండడం గమనార్హం. నాడు బ్రిటిష్‌ పాలనలో పాశ్చాత్య మీడియా వలస దోపిడినీ సమర్థించడం జరిగింది. వారి దోపిడికి అకృత్యాలకు, నిరం కుశత్వానికీ వ్యతిరేకంగా భరత జాతి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం భారతీయ మీడియా ఏర్పడింది. పత్రికా రంగంలో నాడు ఎలాంటి సౌకర్యాలు, స్వేచ్ఛ లేని నిర్బంధ కాలంలో స్వాతంత్రోద్యమ ఆకాంక్షను, ఉద్యమ భావజాల వ్యాప్తికై భారతజాతిని చైతన్యపరుచుటకు సొంత ఆస్తులు అమ్ముకొని అష్ట కష్టాలు పడి పత్రిక (మీడియా) లను నడిపినారు. ఆనాడు మన మీడియా స్వాతంత్రోద్య మానికి వెన్ను దన్నుగా నిలిచింది. దేశ స్వాతంత్య్రానికి నిస్వార్థంగా మీడియా పని చేసింది. ఆ తదనంతరం గత మూడు దశాబ్దాల నుండి ప్రపంచీకరణలో భాగంగా పెట్టు బడిదారీ విధానాలు పాలనలోకి మన దేశంలో ప్రవేశిం చడంతో ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సిన మీడియా కార్పొరేట్ల ప్రయోజనాలకు వత్తాసు పలుకుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ విధానాలు ప్రైవేటీకరణకు పూనుకోవ డంతో పెద్ద మీడియా అతిపెద్ద మీడియాగా ఎదిగి యాజ మాన్యాలకు లబ్ధి చేకూర్చింది. దీనితో పెద్ద కార్పోరేట్‌ శక్తులే మీడియా అధిపతులుగా చలామణి అవుతున్నారు. అనేక భిన్న పరిశ్రమలతో మీడియా సంబంధాలు పెన వేసుకుని పోయింది. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని కార్పొ రేట్లకు ఇస్తున్నా.. ప్రజల మీద అన్యాయంగా పన్నులు, సెస్సుల రూపంలో ఆర్థిక భారాలు మోపుచున్నా చూసి చూడనట్లు మౌనంగా వ్యవహరిస్తుంది. కేంద్రం రాష్ట్రాల హక్కులను, సమాఖ్య స్పూర్తిని హరిస్తూ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను వారి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తుంది..
అయినా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రతి నిధులను సంతలో సరుకుల్లా కొనుగోలు చేస్తూ, ప్రభుత్వా లను అప్రజాస్వామ్యంగా కూలదోస్తున్నా ఈ మీడియా పట్టించుకోవడం లేదు. కార్పొరేట్‌ మీడియా ప్రభుత్వాలకు వత్తాసు (వంత) పాడుచూ స్వప్రయోజనాలను పొందు తుంది. ఈ మీడియా ప్రజల బాధలు, రైతుల ఆత్మహత్య లు, నిరుద్యోగ యువత, కార్మికులు, మధ్య తరగతి, విద్యా ర్థులు, పేదల బాధలు పట్టించుకో కుండా పక్షపాతంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్‌ మీడియా నేడు ఆర్థిక పరిపుష్టి తో నూతన సాంకేతికతను పుణికి పుచ్చుకొని ఆ మాయా జాలపు కబంధహస్తాల్లో మీడియా స్వేచ్ఛ బందీ అయిం దని ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. అయినా నేటికీ పత్రిక(మీడియా) విలువల కోసం నిబద్దతతో వ్యవహ రిస్తూ, పాలకుల నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పత్రిక (మీడియా) సంస్థలు చాలానే ఉన్నాయి. ప్రజల కోసం రాజ్యాంగం ప్రసాదించిన మీడియా స్వేచ్ఛను కాపాడుతుంది. వారి ఆకాంక్షలకు, ఆశయాలకు కట్టుబడి రాస్తున్నాయి.. వినిపి స్తున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని కార్పొరేట్‌ మీడియా చేసే అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా కీర్తించబడుతున్న వేళ.. రాజ్యాంగ బద్ధంగా ప్రజా పాలన సాగించాల్సిన చట్టసభ(సభ్యు)లు పదవీ ప్రమాణా లకు కట్టుబడి మీడియా స్వేచ్ఛలో తలదూర్చకుండా సం క్షేమ, శ్రేయో రాజ్యంగ పాలన అందించాలి. లేదంటే నాటి బ్రిటిష్‌ పాలకులను నేటి ప్రజాపాలకులు మించిపోతున్నా రనే అపకీర్తిని మోయాల్సి వస్తుంది. మన దేశ స్వేచ్ఛ, స్వాతంత్య్రానికై పరితపించిన ఆనాటి ఉద్యమ నాయకుల, భరత జాతి ఆకాంక్షలైన సమభావన, భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలను పరిరక్షించాలి. పౌర సమాజం ఆకాంక్షల్ని పాలకుల అకృత్యాన్ని చెప్పని చూపని మీడి యా ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అని ప్రజాస్వామ్య వాదులు భావిస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే భావ ప్రకటనా స్వేచ్ఛను, మీడియా (పత్రిక)స్వేచ్ఛను హరించడానికి, విమర్శలను తొక్కి పట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవంగా నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటివి. చాలా అవస రము. ప్రజల భావవ్యక్తీకరణ హక్కును పరిరక్షించడం.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. మన రాజ్యాంగం పౌరులకు ఆ భరోసానిస్తుంది. అందుకే మీడియా స్వేచ్ఛ దిగ జారడం వలన పౌర సమా జం గతి ఏమవుతుంది. కావున పాలకులు వెంటనే నిర్బం ధం, ఒత్తిడి లేని ప్రజా జీవనానికి పాటు పడుచూ మీడియా స్వేచ్ఛ పరి రక్షణలో ప్రపంచంలోనే అగ్ర భాగాన నిలవాలి.

  • మేకిరి దామోదర్‌,
    సామాజిక విశ్లేషకులు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News