Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వైసీపీలోకి యర్రం వెంకటేశ్వర్ రెడ్డి

AP: వైసీపీలోకి యర్రం వెంకటేశ్వర్ రెడ్డి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో యర్రం వెంకటేశ్వర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. వెంకటేశ్వర రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు ఆయన కుమారుడు నితిన్‌ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పక్కాల సూరిబాబు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా యర్రం వెంకటేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్‌ గాదె సుజాత హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News