Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: 'శ్రమశక్తి అవార్డ్' గ్రహీతలకు సన్మానం

Manchiryala: ‘శ్రమశక్తి అవార్డ్’ గ్రహీతలకు సన్మానం

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గని ఆవరణలో ఫిట్ సెక్రెటరీ మేండే వెంకటి అద్వర్యంలో మేడే సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రమశక్తి అవార్డు అందుకున్న ఏరియా టీబీజీకేఎస్ నాయకులు శ్రమశక్తి అవార్డ్ గ్రహీతలు అయిన ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, జిఎం కమిటీ సభ్యులు పెట్టం లక్ష్మణ్ లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని మేనేజర్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… గత 35 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం అని, కార్మికుల శ్రేయాషు కోసం పాటుపడుతం అని, తెలంగాణ భోగ్గు గని కార్మిక సంఘం అద్వర్యంలో అనేక హక్కులు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్, జిఎం చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ తొంగల రమేష్, భువనగిరి కిషన్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్, ఏరియా నాయకులు బస్సు రమేష్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రణయ్, షిఫ్ట్ సెక్రటరీలు బుచ్చన్న, ప్రతాప్, మోహన్, నాగయ్య, సారంగపాణి, రాజు నాయక్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, పాదం శ్రీనివాస్, అఖిల్, రాకేష్ మరియు సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, క్యాంటీన్ కమిటీ సభ్యులు, గని అధికారులు, యూనియన్ నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News