Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై జగన్‌ సమీక్ష

AP: పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై జగన్‌ సమీక్ష

పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ సమీక్ష జరిపారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీఎం రివ్యూలోని హైలైట్స్ ఈ కింది విధంగా ఉన్నాయి…

- Advertisement -

సాకారం కానున్న గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల.
ఇళ్లు లేని వారికి ఉచితంగా అమరావతిలో ఇళ్లపట్టాలు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం.
ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛ నెరవేర్చే బృహత్త కార్యక్రమన్న సీఎం.
ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలన్న సీఎం.

–ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.
– 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.
– మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు.
– గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు.
– ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి.
– జంగిల్‌ క్లియరెన్స్, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు ముగిశాయని వెల్లడించిన అధికారులు.
– దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని వెల్లడి.

– ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు.
– 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించిన అధికారులు.
– సీఐటీఐఐఎస్‌ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు.
– దాదాపు 12 అర్భన్‌ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడి.

టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష.
– టిడ్కో ఇళ్లలో ఫేజ్‌ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి.
– 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని వెల్లడించిన అధికారులు.
– జూన్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపిన అధికారులు.
– రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు.
– గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధంచేస్తున్నామన్న అధికారులు.
– జూన్‌ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్న అధికారులు.

– విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.
– దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్న సీఎం.
– వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్న సీఎం.
– పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్న సీఎం.

– విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ద్వారా ఏర్పడ్డ రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం.
– రివర్‌ బెడ్‌పై వాకింగ్‌ ట్రాక్‌ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్‌ పనులను సీఎంకు వివరించిన అధికారులు.

  • విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News