Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: ప్రజావాణి ఫిర్యాదుల విచారణ

Karimnagar: ప్రజావాణి ఫిర్యాదుల విచారణ

గత కొద్ది రోజుల క్రితం ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామ సర్పంచ్ భర్త పై ఇచ్చిన ఫిర్యాదులు విధితమే. కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గోపాలరావుపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోపాలరావుపేట డబుల్ బెడ్ రూమ్ ప్రక్కన కట్టిన ఇంటిపై ఫిర్యాదు రాగా ఆ నిర్మాణాన్ని పల్లె పకృతి వనంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ స్థలాన్ని పరిశీలన చేశారు. డిపిఓ వీర బుచ్చయ్య మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామని మేము పై అధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్య ప్రసన్న వెంకటరామిరెడ్డి, ఉపసర్పంచ్ ఎడవల్లి మధుసూదన్ రెడ్డి, కోఆప్షన్ రజబలి, రాజు, లింగస్వామి, ఫిర్యాదుదారులు ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి ఇన్చార్జి కార్యదర్శి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News