Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: గొల్ల, కురమలను రేవంత్ అవమానించారు

Hyd: గొల్ల, కురమలను రేవంత్ అవమానించారు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం. గొల్ల, కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమానపరిచారని, మేము మా భాధను విచారాన్ని వ్యక్తం చేస్తున్నామంటూ ఎంపీ లింగయ్య అన్నారు. మా జాతులు నీతి నిజాయతీగా బతుకుతాయని, అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి అంటూ రేవంత్ రెడ్డి గతంలో కూడా కుల దూరహంకారంతో మాట్లాడారని ఆయన వాపోయారు. తమకే పాలన తెలుసన్నట్టుగా రేవంత్ రెడ్డి తన కులం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినప్పుడు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదని, రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్ కు నేర చరిత్ర ఉందా అంటూ మండిపడ్డారు.
బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూత నందిస్తే రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని, .జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని రేవంత్ సొంత పార్టీ లోని వారే అంటున్నారని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అన్న ఆయన, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం రేవంత్ ప్రవృత్తి అని మల్లేశం ఆరోపించారు. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని, శ్రీనివాస్ యాదవ్ తో రేవంత్ కు పోలిక ఎక్కడిదన్నారు మల్లేశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News