Saturday, April 19, 2025
HomeతెలంగాణKukatpally: కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన మాధవరం

Kukatpally: కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన మాధవరం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో 173 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, సభీహ గౌసుద్దిన్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ బిజెపి పార్టీలో కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తుందా అని ప్రశ్నించారు అలాగే, సంక్షేమ పథకాలతో ప్రజలకు పెద్దపీట వేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాబోయే రోజుల్లో మంచి పని చేసే పార్టీనే ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News