Saturday, October 5, 2024
HomeతెలంగాణJammikunta: భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టలో కౌశిక్ రెడ్డి

Jammikunta: భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టలో కౌశిక్ రెడ్డి

జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట వేడుకలకు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలను ప్రతిష్టించుకొని గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ ఒకరి పట్ల ఒకరు సోదరుభావం కలిగి ఉండాలని ఆ అమ్మవార్లను కోరుకున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ట వేడుకలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News