Thursday, September 19, 2024
HomeఆటThalasani: నాయిని క్రికెట్ లీగ్ ప్రారంభం

Thalasani: నాయిని క్రికెట్ లీగ్ ప్రారంభం

పేద ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిరంతరం పోరాడారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు నాయిని నర్సింహారెడ్డి 83వ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నాయిని క్రికెట్ లీగ్’ ను మంత్రి ప్రారంభించారు. ముందుగా నాయిని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిదశ, మలిదశ తెలంగాణ పోరాటంలో నాయిని సేవలు ఎనలేనివని కొనియాడారు. అనేక కార్మిక సంఘాలకు నాయకుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని గుర్తు చేశారు. నాయిని నర్సింహారెడ్డి ఎప్పటికీ ప్రజల మనస్సులో ఉంటారని చెప్పారు. ఈ క్రికెట్ పోటీల ద్వారా మరోసారి ఆయన సేవలను స్మరించుకొనే అవకాశం కలిగిందని నిర్వహకులను మంత్రి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News