Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైసీపీని గెలిపించండి

Katasani: వైసీపీని గెలిపించండి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని పాణ్యం ఎమ్యెల్యే కాటసాని భూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్:20 వార్డ్ :53 వ సచివాలయం,మారుతి మెగాసిటీ లో ‘గడప, గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్మోపాల్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో…స్థానిక వార్డ్ కార్పొరేటర్ ఏ.నాగ లక్ష్మీరెడ్డి,కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్లు…వైజా.అరుణ,సాన శ్రీనివాసులు, కార్పొరేటర్లు… దండు లక్ష్మీకాంత్ రెడ్డి,సంగాల సుదర్శన్ రెడ్డి,ఎరుకల వెంకటేశ్వర్లు,మిద్దె చిట్టెమ్మ,కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి,కర్నూలు డి.ఏ.ఏ.బి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు యూనిస్ భాష, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…వైజా.బాలచంద్ర రెడ్డి,బాబాన్న,తిరుమలేష్ గౌడ్,పెద్దన్న,సాయి 20 వ వార్డులోని నాయకులు… శివ శంకర రెడ్డి,లక్ష్మీకాంత్ రెడ్డి,భీమ శంకర్ రెడ్డి,రంగారెడ్డి, ప్రతాప్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి,సంజీవ రెడ్డి,గంగిరెడ్డి, అంబటి రెడ్డి,శివశంకర్ రెడ్డి,ధోరస్వామి,రాజమని,ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News