Friday, September 20, 2024
HomeతెలంగాణKukatpally: లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు

Kukatpally: లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు

కూకట్ పల్లి లో 59 జీఓ క్రింద 10 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలు ఉండి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు రెగ్యులరైజ్ చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఒకపక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధితో పాటు నిరుపేదలకు ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన సీఎం కేసీఆర్ అని అందుకనే ఎంతోకాలంగా నివాసం ఉంటూ వారికి ఎటువంటి భరోసా లేని సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ల నివాసాలను రెగ్యులరైజ్ చేయడం శుభ పరిణామం అని.. పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టమని అన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News