Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: ఆలయాన్ని సందర్శించిన అందెశ్రీ

Mallapur: ఆలయాన్ని సందర్శించిన అందెశ్రీ

కొత్త దాం రాజ్ పల్లి గ్రామంలో గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న విశ్వేశ్వర మహాపీఠం ఆలయాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ సి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. గోదావరి నదిలో స్నానం ఆచరించి ఆలయ పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా అందే శ్రీ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డున ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం మీ గ్రామ ప్రజలకు అదృష్టమని , రాబోవు రోజుల్లో మహా క్షేత్రంగా ఆలయం రూపుదిద్దుకుంటుందని అన్నారు.ఇట్టి కార్యక్రమం లో సింగర్ మల్లిక్ తేజ, అనిల్ రావు, కమలాకర్,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News