Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: లోకేష్.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

Shilpa: లోకేష్.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

శ్రీశైలం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేపథ్యంలో నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరువురు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ మాటల యుద్ధం చినికి చినికి గాలి వానలా మారి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఈనెల 13వ తేదీ ఆత్మకూరులో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని లోకేష్ చీటింగ్ చక్రపాణి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఫైర్ అయిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి లోకేష్ ను రిటన్ గిఫ్ట్ ఇస్తూ లోఫర్ లోకేష్ గా పిలవడం తెలిసింది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర జరుగుతున్న శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకరిపై ఒకరు దూషణల పర్వానికి తెర లేపారు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సి.బి.ఐ తో దర్యాప్తు చేయించాలని ఛాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. తనను చీటింగ్ చక్రపాణి అంటే నేను లోఫర్ లోకేషన్ అని పిలవడంలో తప్పేంటి అని ప్రశ్నించారు. తనపై అసభ్య పదజాలంతో సంస్కృతి, సంస్కారము లేకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్ మెప్పుకోసం ఇలా విచక్షణ లేకుండా మాట్లాడటం బుడ్డా రాజశేఖర్ రెడ్డికి తగదన్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వామి మాల వేసుకొని దుర్భాషలాడడం ఆయనకే చెల్లుతుందన్నారు. నన్ను చీటింగ్ అన్నప్పుడు నేను ఎందుకు లోఫర్ అనకూడదో సమాధానం చెప్పాలన్నారు. నారా లోకేష్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఏదో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడం సరికాదు అన్నారు. నాడు చేపట్టిన పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిపై మాట్లాడే తప్ప లోకేష్ లాగా పరిణతి లేకుండా మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలో మూడుసార్లు ఓడిపోయి నన్ను దుర్భాషలాడుతావా అంటూ బుడ్డ రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో శిల్పా చక్ర పాణి రెడ్డి మండిపడ్డారు. నీరు చెట్టులో నిధులు కాజేసి నాపై ఆరోపణలు చేస్తావా చేతనైతే వర్ధన్ బ్యాంకు విషయంలో జరిగిన కుంభకోణంపై నీవే సీబీఐకి ఫిర్యాదు చెయ్.. దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. ఎన్నికలలోపు సిబిఐ విచారణ తేలేలా చూడు, నేను తప్పు చేశాను అని నిరూపణ ఐతే రాజకీయాలకు స్వస్తి పలుకుతా.. లేకుంటే నీవు కూడా రాజకీయాలకు గుడ్ బై చేస్తావా అని ఛాలెంజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ టిడిపికి అమ్ముడుపోయిన బుడ్డా నీవు నన్ను మాట్లాడతావా అంటూ బుడ్డా పైర్ అయ్యారు. బుద్ధిలేని బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాటలను సరి చేసుకో లేకుంటే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. నేనే నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా.. టైం.. ప్లేస్ చెప్పు నేనే వస్తానంటూ ఛాలెంజ్ చేశారు. నన్ను చెప్పుతో కొడతావా.. నాకు చెప్పులు ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీవి ఉన్నాయి.. కొట్టినా తెగేవి కావని బదులిచ్చారు. శ్రీశైలంలో 3500 పట్టాలు ఇచ్చానని నాపై ఆరోపణ చేస్తున్నావు, ఇరిగేషన్ భూములకు పట్టాలుగా చేసి ఎలా పంచుతారో తెలియని వాడివి అవగాహన లేనివాడివి నన్ను మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన బలం వుంది అంటున్నావు, అలాగైతే మూడుసార్లు ఎలా ఓడిపోయావో చెప్పాలన్నారు. జగనన్న పుణ్యమా అని ఒకసారి గెలిచావు అది కొద్దిపాటి మెజారిటీతో అలాంటి వాడివి నన్ను మాట్లాడతావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత తమ్ముడిని మోసం చేశావు, తల్లికి మాటిచ్చి మోసగించావు, నీవు నా నిజాయితీ, క్యారెక్టర్ గురించి చెప్పే వాడివా అంటూ ఫైర్ అయ్యారు. ఇంతటితో దుర్భాషలాడడం, బూతులు వల్లించడం మానుకోవాలని, ఫుల్ స్టాప్ పెట్టాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News