Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Maddikera: విధుల పట్ల నిర్లక్ష్య వద్దు

Maddikera: విధుల పట్ల నిర్లక్ష్య వద్దు

విధుల పట్ల ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని మద్దికెర జడ్పిటిసి సభ్యులు మురళీధర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెరవలి గ్రామంలో సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తమ విధులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమంగా పనిచేయాలని, ప్రభుత్వం నిర్ణీత సమయంలో హాజరై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఆధార్ ప్రత్యేక కౌంటర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రేలంపాడు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, రామలింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, విఆర్వోలు మల్లికార్జున, ఆనందయ్య, వైసీపీ నాయకులు రామకృష్ణ (చిట్టి), ముష్టూర్ రామాంజనేయులు, అశోక్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News